సూరత్‌లో కూలిన ఐదంతస్తుల భవనం.. ఏడుగురు మృతి

గుజరాత్‌లోని సూరత్‌లో ఐదు అంతస్థుల భవనం కూలిన ఘటనలో 7 మంది మృతి చెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు.

సూరత్‌లో కూలిన ఐదంతస్తుల భవనం.. ఏడుగురు మృతి
X

గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం మధ్యాహ్నం ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఆదివారం భవనం కూలిన ప్రదేశంలో కనీసం ఏడు మృతదేహాలను వెలికితీశారు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో శిథిలాల కింద కనీసం నలుగురైదుగురు వ్యక్తులు చిక్కుకుపోయారు.రాత్రంతా గాలింపు ఆపరేషన్ కొనసాగిందని ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని సూరత్‌లోని చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పరీక్ ధృవీకరించారు,

2016 లో నిర్మించిన ఈ భవనం కొన్నిరోజులుగా పడుతున్న భారీ వర్షాలకు కూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ భవనం సమీపంలోని ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నకార్మికలు ఇందులో నివసిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్ రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్న సందర్భంలో శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తుల గొంతులు వినిపించాయని ధృవీకరించారు. శిథిలాల నుండి ఒక మహిళను సజీవంగా రక్షించి ఆసుపత్రికి పంపామని తెలిపారు. సుమారు ఐదుగురు వ్యక్తులు ఇంకా లోపలే చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నామని గెహ్లాట్ చెప్పారు.

Raju

Raju

Writer
    Next Story