రౌడీషీటర్‌ దారుణ హత్య

కంచన్‌ బాగ్‌కు చెందిన రౌడీషీటర్‌ రియాజ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.

రౌడీషీటర్‌ దారుణ హత్య
X

హైదరాబాద్‌ బాలాపూర్‌లో రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. కంచన్‌ బాగ్‌కు చెందిన రౌడీషీటర్‌ రియాజ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రియాజ్‌ మృతదేహాన్ని ఉస్మానియా అస్పత్రికి తరలించారు.బాలాపూర్‌ ఆర్‌సీఐ రోడ్డు వద్ద కారుతో బైక్‌ను ఢీకొట్టి కాల్పులు జరిపి దుండగులు హత్య చేశారు. ఘటనాస్థలం వద్ద పోలీసులు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

రియాజ్‌పై బాలాపూర్ తో పాటు హైదరాబాద్‌ నగరంలో పలు కేసులున్నాయని సీపీ తెలిపారు. ప్రస్తుతం అతను మీర్‌పేట్‌ పరిసర ప్రాంతం నివాసం ఉంటున్నట్లు చెప్పారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నదని, దర్యాప్తు చేస్తున్నామని సీపీ పేర్కొన్నారు.

Raju

Raju

Writer
    Next Story