కంటైనర్‌లో తరలిస్తున్న 800 గంజాయి స్వాధీనం

నగరంలోని పెద్ద గోల్కొండ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఓ కంటైనర్‌లో 800 కిలోల గంజాయిని బాలానగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కంటైనర్‌లో తరలిస్తున్న 800 గంజాయి స్వాధీనం
X

హైదరాబాద్‌లో మరోసారి పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడింది. నగరంలోని పెద్ద గోల్కొండ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఓ కంటైనర్‌లో 800 కిలోల గంజాయిని బాలానగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఒడిశా నుంచి తరలిస్తున్నట్టు గుర్తించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ ఘటనలో మొత్తం ఏడుగురిని నిందితులుగా గుర్తించినట్లు అందులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వారిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తామన్నారు. కంటైనర్‌లో గంజాయి తరలించిన ఘటన ఇదే మొదటిసారి అని, పట్టుబడిన గంజాయి నాణ్యతలో మేటిగా ఉందని పోలీసులు వెల్లడించారు.

Raju

Raju

Writer
    Next Story