ఇరాన్లో బస్సు బోల్తా.. 30 మంది పాకిస్థాన్ యాత్రికుల మృతి
పాక్ నుంచి ఇరాన్ వెళ్లిన యాత్రికుల బస్సు ఇరాన్లోని సెంట్రల్ ప్రావిన్స్లో యాజ్ద్ వద్ద బోల్తా కొట్టడంతో 30 మంది మృతి చెందారు.
- By RajuLoading...
- | 21 Aug 2024 5:52 AM GMT
X
X
పాకిస్థాన్ నుంచి ఇరాక్కు షియా యాత్రికులతో వెళ్తున్న బస్సు సెంట్రల్ ఇరాన్ ప్రావిన్స్లో యాజ్ధ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బస్సు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగిందని ఈ ఘటనలో 30 మందికి పైగా చనిపోయినట్లు పాక్ రేడియోలో వార్తలు ప్రసారమౌతున్నాయి. మరో 23 మంది గాయపడ్డారని, వారిలో 14మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వాధికారులు వెల్లడించారు.
సెంట్రల్ ఇరాన్ ప్రావిన్స్ యాజ్ద్లో మంగళవారం రాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్త సంస్థ తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 51 మంది ఉన్నారు.
Raju
Writer
Next Story