ఇరాన్‌లో బస్సు బోల్తా.. 30 మంది పాకిస్థాన్‌ యాత్రికుల మృతి

పాక్‌ నుంచి ఇరాన్‌ వెళ్లిన యాత్రికుల బస్సు ఇరాన్‌లోని సెంట్రల్‌ ప్రావిన్స్‌లో యాజ్ద్‌ వద్ద బోల్తా కొట్టడంతో 30 మంది మృతి చెందారు.

ఇరాన్‌లో బస్సు బోల్తా.. 30 మంది పాకిస్థాన్‌ యాత్రికుల మృతి
X

పాకిస్థాన్‌ నుంచి ఇరాక్‌కు షియా యాత్రికులతో వెళ్తున్న బస్సు సెంట్రల్‌ ఇరాన్‌ ప్రావిన్స్‌లో యాజ్ధ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బస్సు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగిందని ఈ ఘటనలో 30 మందికి పైగా చనిపోయినట్లు పాక్‌ రేడియోలో వార్తలు ప్రసారమౌతున్నాయి. మరో 23 మంది గాయపడ్డారని, వారిలో 14మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వాధికారులు వెల్లడించారు.

సెంట్రల్‌ ఇరాన్‌ ప్రావిన్స్‌ యాజ్ద్‌లో మంగళవారం రాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు ఇరాన్‌ ప్రభుత్వ వార్త సంస్థ తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 51 మంది ఉన్నారు.

Raju

Raju

Writer
    Next Story