స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు 12 మంది సజీవ దహనం
సౌతాఫ్రికాలో దారుణం జరిగింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడి, మంటలు అంటుకోవడంతో 12 విద్యార్థులతో పాటు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు.
- By RajuLoading...
- | 11 July 2024 2:47 AM GMT
X
సౌతాఫ్రికాలో దారుణం జరిగింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడి, మంటలు అంటుకోవడంతో 12 విద్యార్థులతో పాటు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మరో ఏడుగురు పిల్లలు గాయపడ్డారు.గౌటెంగ్ ప్రావిన్స్లోని మోరాఫంగ్ నగరంలో బుధవారం ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది. బస్సును ఓ చిన్న ట్రక్కు వెనుక నుంచి ఢీ కొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
శీతాకాల సెలవుల తర్వాత స్కూళ్లు తెరిచిన ఒకరోజు వ్యవధిలోనే ఈ విషాదం నెలకొనడం అందరినీ కలిచివేస్తున్నది. గాయపడిన చిన్నారులను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. విద్య, రవాణశాఖ అధికారులు అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్లోని ప్రావిన్స్లలో వేలాదిమంది విద్యార్థులు పాఠశాల రవాణ కోసం ప్రైవేట్ మినీ బస్సులపైనే ఆధారపడుతారు. చాలామంది ప్రజారవాణ కోసం మున్సిపల్ బస్సులు, ట్యాక్సీలపైనే ఆధారపడుతారు.