- Home >
- Entertainment >
- Cinema
సాయంలోనూ బాహుబలి
అల్లు అర్జున్ రూ. కోటి విరాళం
- By RajuLoading...
- | 4 Sept 2024 7:44 AM GMT
X
భారీ వర్షాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల జనజీవనం అస్తవ్యవస్తమైంది. ప్రజలు సర్వం కోల్పోయి రోడ్లపై పడ్డారు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులను ఆదుకోవడానికి సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రూ. 2 కోట్లు , స్టైలిశ్ స్టార్ అల్లు అర్జున్ రూ. కోటి విరాళంగా ప్రకటించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వరద సాయం కింద ప్రభాస్ రూ. 2 కోట్లు, అల్లు అర్జున్ రూ. కోటి విరాళంగా ఇచ్చారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ. కోటి ఇస్తున్నట్లు ప్రభాస్ ప్రకటించగా..చెరో రూ. 50 లక్షలు ఇస్తున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు వీటిని అందజేస్తున్నట్లు ప్రకటించారు. అల్లు అర్జున్ ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ విపత్కర పరిస్థితులు త్వరగా తొలిగిపోవాలని, ప్రజంతా సురక్షితంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టిస్తున్నది. దీంతో సినీ ప్రముఖులు బాధితులకు అండగా నిలుస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్బాబు రూ. కోటి చొప్పున విరాళం ప్రకటించారు.