- Home >
- Entertainment >
- Cinema
పెళ్లి చేసుకున్న జైబోలో తెలంగాణ హీరోయిన్
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన జైబోలో తెలంగాణ సినిమా హీరోయిన్ మీరా నందన్
- By VamshiLoading...
- | 29 Jun 2024 2:18 PM GMT
X
X
జైబోలో తెలంగాణ సినిమా హీరోయిన్ మీరా నందన్ తన ప్రియుడు శ్రీజును వివాహం చేసుకున్నారు. కేరళలోని గురువాయూర్ ఆలయంలో ఈరోజు ఏడడుగులు వేసింది. 2008లో ముల్లా మూవీతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మీరా నందన్.
జై బోలో తెలంగాణ సినిమా 2011లో విడుదలైన అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఈమూవీలో జగపతి బాబు, స్మృతి ఇరానీ, సందీప్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. మీరా నందన్ తెలంగాణ అమ్మాయిగా బాగా నటించారు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమాన్ని ఈ సినిమా బాగా ప్రభావితం చేసింది. ప్రస్తుతం మీరా నందన్ మ్యారేజ్కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ప్రముఖులు, నెటిజన్స్ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Vamshi
Writer
Next Story