- Home >
- Entertainment >
- Cinema
ఏడ్చేసిన పవన్ కళ్యాణ్ కూతురు ఎందుకంటే!
నా శాపం మీకు తగులుతుందని.. మమ్మల్ని ఎగతాళి చేసేముందు మీ ఇండ్లలోనూ ఆడవాళ్లు ఉన్నారనే సంగతి మరువద్దని సోషల్ మీడియా మీమర్స్, ట్రోలర్స్పై రేణుదేశాయ్ హెచ్చారించారు.
- By VamshiLoading...
- | 26 Jun 2024 5:50 AM GMT
X
సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్పై రేణుదేశాయ్ మండిపడ్డారు. తనను ఎగతాళి చేస్తూ ఓ మీమ్ పేజ్ చేసిన పోస్టును చూసి కూతురు ఆద్య ఏడ్చేసిందని రేణు ఆగ్రహం వ్యక్తం చేసింది. మమ్మల్ని ఎగతాళి చేసేముందు మీ ఇండ్లలోనూ తల్లులు, సిస్టర్స్ ఉన్నరని గుర్తుంచుకోండి అన్నారు. ఈ రోజు నా కుమారై అనుభవించిన బాధ, ఆమె కన్నీళ్లు ఈ తల్లి శాపం కచ్చితంగా తగులుతుందన్నారు. అని పవన్, లెజినొవాతో తన పిల్లలున్న ఫోటోను పోస్ట్ చేశారు. పవన్ అభిమానులు రేణు దేశాయ్ మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్దం నడుస్తోంది. మనుషులు ఇంత దారుణంగా తయారవడం సిగ్గుచేటు అంటూ ఇన్స్టాలో రేణు పోస్ట్ చేశారు.
తన గురించి ఇష్టమొచ్చినట్టు రాసిన కామెంట్లు, మీమ్స్ చూసి తన కూతురు ఆద్య తీవ్రంగా ఏడ్చిందని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను వారి ఫొటోను ఎలా క్రాప్ చేస్తానో.. ఎలా పోస్ట్ చేస్తానో అంటూ.. మీమ్స్ వేసిన వారందరికీ కూడా ఒక ఫ్యామిలీ ఉంటుందని గుర్తుంచుకోండి. ఆద్య నన్ను ఎగతాళి చేయడాన్ని చూసి తీవ్రంగా ఏడ్చింది.సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబాలను ఎగతాళి చేసే వారంతా ఒక్కసారి మీ ఇళ్లలోనూ తల్లులు, అక్కాచెల్లెళ్లు ఉన్నారని గుర్తుంచుకోండి.