లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు

అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల మధ్య దేశీయ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు
X

అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల మధ్య దేశీయ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 212 పాయింట్ల లాభంతో 82,578 వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ 66 పాయింట్లు పెరిగి 25,302 వద్ద ట్రేడవుతున్నది.డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.87 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌ సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టెక్‌ మహీంద్రా, ఐటీసీ, ఎం అండ్‌ ఎం, టాటా స్టీల్‌, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా మోటార్స్‌, టైటన్‌, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి.


Raju

Raju

Writer
    Next Story