బీజేపీకి వైసీపీ బిగ్ షాక్.. వక్స్ బోర్డు బిల్లును వ్యతిరేకించిన ఫ్యాన్ పార్టీ
బీజేపీకి వైసీపీ బిగ్ షాక్ ఇచ్చింది. లోక్ సభలో మోదీ సర్కార్ ప్రవేశ పెట్టిన వక్స్ బోర్డు సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది..
By : Vamshi
Update: 2024-08-08 13:13 GMT
బీజేపీకి వైసీపీ బిగ్ షాక్ ఇచ్చింది. లోక్ సభలో ఎన్డీయే సర్కార్ ప్రవేశ పెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును జగన్ పార్టీ వ్యతిరేకించింది. ఈ క్రమంలో వైసీపీ ఇండియా కూటమిలో చేరుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈరోజు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును మోదీ సర్కార్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది.
కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు లోక్ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు టీడీపీ, జేడీయూ సహా ఎన్డీయే మిత్రపక్షాలు మద్దతు ప్రకటించాయి. కానీ, విపక్షాలు మాత్రం బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో గత కొన్నిళ్లుగా వైసీపీ. మోదీ సర్కార్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చారు. ఫ్యాన్ పార్టీ ఈసారి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంతో రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది.