పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదు : ఈటల
పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
అక్రమ కట్టడాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చివేస్తోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరడంలేదని అక్రమంగా పేదల ఇళ్లను కూల్చివేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. రేవంత్రెడ్డి అధికారంలోకి రాగానే అక్కడున్న నిర్మాణాలను అకారణంగా కూల్చేశారు. భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయటం దారుణమన్నారు.
రాజశేఖర్ రెడ్డి హయాంలో గులాంగిరి చేసిన అధికారులు జైలపాలయ్యారు అనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నామన్నారు.ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు చేస్తే వీరికి కూడా అదే గతి పడుతుందన్నారు. అధికారులు చట్టానికి లోబడి పని చేయాలి తప్ప బానిసలుగా పనిచేస్తే ఏం జరుగుతుందో గతంలో చూశారు కాదా.పేదలకు ఇబ్బంది పెడితే వారి జేజమ్మతోనైనా కొట్లాడటానికి సిద్ధమని ఈటల హెచ్చారించారు.. ఈ సమస్యపై మాట్లాడటానికి అధికారులు, మంత్రులకు ఫోన్ చేస్తే వారు మాట్లాడటం లేదు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటికి ఫోన్ చేసినా వారు లిఫ్ట్ చేయలేదు. ప్రభుత్వ చర్యలను కచ్చితంగా అడ్డుకుంటాం’ అని వ్యాఖ్యలు చేశారు.