పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ రేపటికి వాయిదా

బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల కేసు విచారణ రేపటికి వాయిదా పడింది.

By :  Vamshi
Update: 2024-08-06 13:25 GMT

బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల కేసు విచారణ రేపు బుధవారానికి వాయిదా పడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వారిపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను ఆదేశించాలని కోరింది. ఈ పిటిషన్‌పై ఈరోజు కోర్టు విచారణ జరిపింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని బీఆర్ఎస్ న్యాయవాది కోర్టును కోరారు.

అయితే అనర్హత నిర్ణయంపై స్పీకర్‌కు కోర్టులు గడువును నిర్దేశించలేవని ఏజీ వాదించారు. రేపు బుధవారం నాడు మరిన్ని వాదనలు వినిపిస్తామని ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ రేపటికి వాయిదా పడింది. పార్టీ మారిన శాసన సభ్యులపై చర్యలు తీసుకునేలా హిమచల్‌ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో కోర్టులు తీర్పులిచ్చాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీర్పు కాఫీలను సమర్పించారు. ఆ కాఫీలను ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకించారు.

Tags:    

Similar News