నేడు హైదరాబాద్ కు టీడీపీ చీఫ్ చంద్రబాబు

తెలంగాణలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలతోసమావేశం

Update: 2024-08-23 05:28 GMT

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం హైదరాబాద్ కు రానున్నారు. రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం బయల్దేరుతారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎన్ టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకొని పార్టీ తెలంగాణ నేతలతో సమావేశమవుతారు. తెలంగాణ లో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ సహా ఇతర అంశాలపై ఆయన చర్చించనున్నారు.

Tags:    

Similar News