ఎమ్మెల్యే దానంపై స్పీకర్ చర్యలు తీసుకోవాలి : వేముల ప్రశాంత్ రెడ్డి

నిండు సభలో దానం నాగేందర్ వీధి రౌడీలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు

By :  Vamshi
Update: 2024-08-02 15:17 GMT

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నిండు శాసనసభలో వీధి రౌడీలా వ్యవహరించిన తీరు జుగుప్సాకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయ అవగాహన లేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారనీ,సభా మర్యాదలను, సభా గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ మంట గలిపిందనీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యథా రాజా తథా ప్రజా అన్నట్టు సీఎం రేవంత్ ప్రవర్తనకు ఏ మాత్రం తగ్గకుండా వారి ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు.

నిన్న బీఆర్ఎస్ పార్టీ మహిళ శాసన సభ్యులను ముఖ్యమంత్రి, ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై శాసన సభలో దానం నాగేందర్ పరుష పదజాలంతో తులనాడటం విచారకరమన్నారు. అసెంబ్లీలో దానం నాగేందర్ మాట్లాడిన భాష... రౌడి షీటర్ లా సభ్యసమాజం తల దించుకునేలా ఉంది. శాసన సభ అంటే ప్రజల్లో ఏహ్యభావం కలిగేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారు, ప్రజా సమస్యలు పరిష్కరించే దేవాలయాన్ని బూతు మాటలు మాట్లాడే సభ గా కాంగ్రెస్ వాళ్ళు మార్చేశారనీ ఎమ్మెల్యే వేముల ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పై శాసన సభాపతి వెంటనే చర్యలు తీసుకోవాలనీ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News