'నీట్‌' రద్దు చేయాలని కోరుతూ.. కిషన్‌రెడ్డి ఇల్లు ముట్టడి

నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ.. కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటిని ఎన్‌ఎస్‌యూఐ, వివిధ విద్యార్థి సంఘాల నేతలు, కార్యకర్తలు ముట్టడించారు.

By :  Raju
Update: 2024-06-22 04:52 GMT

నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ.. కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటిని ఎన్‌ఎస్‌యూఐ, వివిధ విద్యార్థి సంఘాల నేతలు, కార్యకర్తలు ముట్టడించారు. ఆయన ఇంటి ముందు ఆందోళన చేశారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. మా న్యాయం చేయాలని, నీట్‌ పరీక్షను రద్దు చేయాని నినదించారు. కిషన్‌రెడ్డి డౌన్‌ డౌన్‌ అని నినాదాలు చేశారు.

జాతీయ స్థాయిలో వైద్య విద్యను అభ్యసించడానికి నిర్వహించే నీట్‌ అవకతవకలకు బాధ్యత వహిస్తూ నీట్‌ ఛైర్మన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న బల్మూరి వెంకట్‌ సహా అరెస్టు చేసి నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

Tags:    

Similar News