హరీశ్ రావు లేఖతో దిగొచ్చిన రేవంత్ ప్రభుత్వం

మాజీ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తితో రేవంత్ సర్కార్ దిగివచ్చింది.నేటి నుండి మిడ్ మానేరు ద్వారా గోదావరి జలాల ఎత్తిపోత ప్రారంభం కాబోతుంది.

By :  Vamshi
Update: 2024-08-05 05:45 GMT

మాజీ మంత్రి హరీశ్ రావు దెబ్బకు దిగి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. నీళ్లు లేక వెలవెలబోతున్న సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లకు వెంటనే గోదావరి జలాలను ఎత్తిపోసి రైతాంగాన్ని ఆదుకోవాలని రెండ్రోజుల క్రితం హరీష్ రావు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖకు సర్కార్ నుండి స్పందన వచ్చింది.

నేటి నుండి మిడ్ మానేరు ద్వారా గోదావరి జలాల ఎత్తిపోత ప్రారంభం కాబోతుంది. సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు నీటి విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా ప్రకటించారు. మరోవైపు భారీ వర్షాలతో రైతులు సతమతం అవుతున్నారని అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి మిడ్ మానెర్ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్‌లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని హరీష్ రావు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News