ముద్రగడ పేరు మార్పుపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల
ముద్రగడ పద్మనాభం పేరు మార్పుపై పెట్టుకున్న దరఖాస్తుపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు
By : Raju
Update: 2024-06-20 06:50 GMT
కాపు నేత ముద్రగడ పద్మనాభం పేరు మార్పుపై పెట్టుకున్న దరఖాస్తుపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు.ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. పిఠాపురంలో పవన్ గెలుపుతో తన సవాల్కు కట్టుబడి ఉంటానని పేరు మార్పు కోసం ముద్రగడ దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు పద్మనాభం పేరు మార్పుపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.