దక్షిణాదిపై బీజేపీ కోపానికి కారణమిదే.. ఎమ్మెల్యే కూనంనేని

2014 నుంచి దేశంలో కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కువ అయ్యాయని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

By :  Vamshi
Update: 2024-07-24 12:15 GMT

కేంద్రం ప్రభుత్వం జీఎస్టీ తెచ్చి రాష్ట్రాలను యాచకులుగా మార్చిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్రం అనేది మిథ్య అని ఆనాడు ఎన్డీఆర్ అందుకే అన్నారని కూనంనేని గుర్తు చేశారు. భారతదేశంలో నేడు రాజనీతిజ్ఞుల కొరత ఉందని కూనంనే అభిప్రాయపడ్డారు. ప్రజలు చెల్లించిన పన్నులనే మళ్లీ మనం ఖర్చు చేస్తున్నాం కదా అన్నారు. 2014 నుంచి దేశంలో కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కువ అయ్యాయన్నారు.

దక్షిణ భారత రాష్ట్రాలు విడిపోవాలి అనే డిమాండ్లు వచ్చేలా పరిస్థితి తయారైందన్నారు. ఈ పరిస్థితులు దేశాని మంచిది కాదని హితవు పలికారు. బీజేపీకి దక్షిణ భారత్ లో సరిగా సీట్లు రావట్లేదు.. ఆ కోపం వాళ్లలో ఉందని అన్నారు. ఇవాళ ప్రధాని మోదీకీ ఏపీతో అవసరం ఉంది కాబట్టే కొంచెం ఎక్కువ నిధులు ఇచ్చారని అభిప్రాయపడ్డారు. కొత్త పద్ధతుల్లో కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని తెలిపారు. బొగ్గు, నీళ్లు, ఖనిజం, కరెంట్ ఉన్నప్పటికీ బయ్యారం ఉక్కు పరిశ్రమను ఎందుకు చేపట్టడం లేదని కేంద్రాన్ని నిలదీశారు. గిరిజన యూనివర్సిటీని నామమాత్రంగా ప్రకటించారని నిధులు కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే కూనంనేని అన్నారు.

Tags:    

Similar News