బీఆర్ఎస్ పాలనలో నేతన్నల జీవితాల్లో వెలుగులు : హరీశ్ రావు

తెలంగాణ ఏర్పాటు తర్వాత చేనేతల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనేక పథకాలు సత్ఫలితాలు ఇస్తాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

By :  Vamshi
Update: 2024-08-07 09:34 GMT

తెలంగాణ ఏర్పాటు తర్వాత చేనేతల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనేక పథకాలు సత్ఫలితాలు ఇస్తాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో చేనేత రంగంలో బంగారు బాటలు వేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో నేతన్నలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు పాల్పడుతున్నరని ఎక్స్ ద్వారా తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సిరిసిల్లలో అప్పరెల్ పార్క్ ఏర్పాటు ఓ సంకల్పమని.. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఓ సంచలనమని పేర్కొన్నారు.

Tags:    

Similar News