కేంద్రాన్ని తిట్టడానికే శాసనసభ సమావేశం : కిషన్ రెడ్డి

కేంద్రాన్ని తిట్టడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చర్చ పెట్టినట్లుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

By :  Vamshi
Update: 2024-07-24 14:04 GMT

కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం కోసమే సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చర్చ పెట్టారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి చేస్తే తమకు ప్రజలు ఓట్లు వేశారని చెప్పారు. రేవంత్, కేసీఆర్ దయ వల్లో బీజేపీ గెలవలేదన్నారు. హామీలు అమలు చేయాలని అడిగితే కుంటిసాకులు చెబుతున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో దీక్షలంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 35శాతం ఓట్ షేర్ వచ్చిందని.. నీతి ఆయోగ్‌ను బహిష్కరిస్తామనడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు.

రూ.లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నాయకులు దివాళా తీశారన్నారు. పదేళ్లుగా కేసీఆర్ వ్యవహరించిన శైలిలోనే సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక నిందలు వేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాల కోసం కేంద్రం రూ.6లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. పునర్విభజన చట్టం కింద అనేక హామీలు అమలు చేశామన్నారు. రామగుండంలో విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేశారన్నారు. గిరిజన వర్సిటీ కోసం కేంద్రం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. జీఎస్టీ పరిహారం కింద రూ.7 వేల కోట్లను రాష్ట్రానికి అందజేశామన్నారు.

Tags:    

Similar News