ఢిల్లీకి కేటీఆర్, హరీశ్ రావు
రేపు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఉండటంతో ఢిల్లీకి బీఆర్ఎస్ నేతలు
By : Naveen Kamera
Update: 2024-08-26 10:33 GMT
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఉండటంతో బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఢిల్లీకి చేరుకుంటున్నారు. కేటీఆర్, హరీశ్ రావు వెంట మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు రాత్రి, మంగళవారం ఉదయం మరికొందరు నాయకలు ఢిల్లీకి చేరుకునే అవకాశముందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈసారి బెయిల్ వచ్చే అవకాశముందని పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఐదు నెలలుగా తీహార్ జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు.