రుణ మాఫీ కాలేదా.. బీఆర్ఎస్ టోల్ ఫ్రీ నంబర్‌ 8374852619 కి కాల్ చేయండి

తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంగా బతికేల గుండె మీద చేయి వేసుకుని చెప్పేలా మాజీ సీఎం కేసీఆర్ అన్ని చర్యలు తీసుకున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

By :  Vamshi
Update: 2024-08-05 07:22 GMT

అర్హులైన రుణమాఫీ జరగని రైతులకు బీఆర్ఎస్ టెక్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 8374852619 కు సంప్రదించాలని మాజీ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి కోరారు. అర్హులై ఉండి ఇప్పటి దాకా లక్ష, లక్ష న్నర లోపు రుణాలు మాఫీ కాని వారు ఫిర్యాదులు చేసేందుకు తెలంగాణ భవన్ లో హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, బీఆర్ఎస్ నేత ఇబ్రహీంతో తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. 60 లక్షల మంది కి పైగా రైతులు రుణాలు తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంఖ్యను తక్కువ చేసి చూపుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం రుణ మాఫీకి ఇంకా 18 వేల కోట్ల రూపాయలు కావాలి ..ఈ డబ్బులను సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి డాలర్ల రూపం లో తెస్తారా ఏమో చూడాలని స్పష్టం చేశారు.

రైతు భరోసానే కాదు ఎవ్వరికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో భరోసా లేదని ఆయన తెలిపారు. రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిన ప్రభుత్వంఈ దేశంలో రేవంత్ సర్కార్ ఒక్కటే అన్నారు. గత బీఆర్‌ఎస్ హయంలో ఇచ్చినట్టే రైతు బంధుపై ఎలాంటి ఆంక్షలు ఇవ్వకుండా అమలు చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ రైతు బంధు కింద ఒక విడతలో ఇచ్చిన మొత్తం రూ.7300 కోట్ల రూపాయలు అని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం పేపర్ ప్రకటనల కోసం రెండు వందల కోట్లు వృధా ఖర్చు చేశారన్నారు. లక్ష లోపు రుణ మాఫీకి ప్రభుత్వం కేటాయించిన మొత్తం 6 వేల కోట్ల రూపాయలు మాత్రమే .లక్షన్నర లోపు రుణాలకు ప్రభుత్వం కేటాయించింది 12 వేల కోట్ల రూపాయలు మాత్రమే ..రైతు భరోసా అమలు చేస్తే 30 వేల కోట్ల రూపాయలు అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంగా బతికేల కేసీఆర్ మంచి పనులు చేశారన్నరు.

రైతులకు ఉచిత విద్యుత్ పెట్టుబడి సాయం ఇచ్చి సంపూర్ణ రక్షణ వలయం ఏర్పాటు చేశారని వ్యవసాయ శాస్త్రవేత్త దివంగత స్వామి నాథన్ సైతం కేసీఆర్ తీసుకున్న చర్యలను అభినందిచారని నిరంజన్ రెడ్డి తెలిపారు. బ్యాంకుల దగ్గర రైతులు ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. చిన్న చిన్న సాకులతో రైతు రుణ మాఫీని ఎగ్గొడుతున్నారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. గ్రామాల్లో లక్ష లోపు రుణ మాఫీ కాని వారు చాలా మంది ఉన్నారన్నారు. గ్రామాలకు కాంగ్రెస్ నేతలు వస్తారా ? రుణ మాఫీ కాని వాళ్ళను చూపిస్తామన్నారు. మాటల్లో ఏ కొర్రీలు లేవంటున్నారు.. క్షేత్ర స్థాయిలో అనేక కొర్రీలు పెడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వం మీద రైతులు భ్రమలు తొలగించుకోవాలన్నారు. 

Tags:    

Similar News