సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కార్తీక్ రెడ్డి కౌంటర్

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సబిత కుమారుడు, బీఆర్ఎస్ నాయకుడు కార్తీక్ రెడ్డి స్పందించారు. ఎవరికి ఎవరు మోసం చేశారు, ఎవరి వల్ల ఎవరికి లాభం జరిగింది అనేది ఆ దేవుడికి తెలుసు అన్నారు.

By :  Vamshi
Update: 2024-07-31 15:42 GMT

బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ యువ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఎవరికి ఎవరు మోసం చేశారు, ఎవరి వల్ల ఎవరికి లాభం జరిగింది అనేది ఆ దేవుడికి తెలుసు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2019 సంవత్సరంలో మేము నిన్ను వదిలి పార్టీ మారాము అనేది మీ బాద అయితే? ఆరోజు మీ కనుల ముందు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దలు మిమ్మల్ని మేము పార్టీలోకి తీసుకువచ్చాం అని అక్కసుతో నన్ను, మా అమ్మని నానా ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఏం చేశావు అని ప్రశ్నించారు.

వాళ్ళు నన్ను, మా కుటుంబాన్ని రాజాకీయ సమాధి చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు ఎక్కడికి పోయారు అన్నా అని నిలదీశారు. అందరికీ నోరారా 'మా అన్న రేవంత్ అన్న' అని చెప్పుకున్న నన్ను, నాకు అవసరం ఉన్నప్పుడు ఒక అండగా ఉండాల్సిన సమయంలో నన్ను అనాదగా వదిలి వెళ్ళింది మీరు కాదా? అని ప్రశ్నించారు. 2018 సంవత్సరంలో నా రాజకీయ భవిష్యత్ కోసం ఒక మాట సహాయం చేయండి అని వేడుకుంటే, "నా చేతిలో ఏమి ఉంది" అని చెప్పి నాగుండెకు మానలేని గాయం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. పార్టీలు మారిన ఎప్పుడూ మీరూ మరియు వదినమ్మ బాగుండాలని కోరుకున్న వాళ్ళము మేము, మీ నాశనము ఎప్పుడు కోరుకోలేదని తెలిపారు. బాద అనేది మీకు ఎంత కలిగిందో దానికి రెట్టింపు బాద నాకు కలిగింది అని కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News