ప్రభుత్వ కాలేజీలను బలోపేతం చేయాలి : శ్రీనివాస్ గౌడ్
తెలంగాణలో గెస్ట్ లెక్చరర్స్ను రెన్యువల్ చేయాలని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు
By : Vamshi
Update: 2024-06-27 09:10 GMT
రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలను బలోపేతం చేయాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. 35 వేల మందికి పైగా ఉన్న అతిథి అధ్యాపకులకు రెన్యువల్ చేయాలని కోరారు. ఇంటర్ కళాశాలల్లో లెక్చరర్స్ లేరని కాలేజీలో అడ్మిషన్లు ఎలా చేపడతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయంలో అనేక ప్రభుత్వ కళాశాలు మంజూరు చేశామన్నారు. ప్రయివేటు కళాశాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. గెస్ట్ లెక్చరర్స్ జీత భత్యాలు పెంచాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు.