వరద సహాయక చర్యల్లో ప్రతి బీజేపీ కార్యకర్త పాల్గోనాలి : కిషన్రెడ్డి
తెలంగాణలో వరద సహాయక చర్యల్లో ప్రతి బీజేపీ కార్యకర్త, నేతలు పాల్గొనాలని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ నాంపల్లి స్టేట్ ఆఫీస్లో బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు.
By : Vamshi
Update: 2024-09-03 08:19 GMT
తెలంగాణలో వరద సహాయక చర్యల్లో ప్రతి బీజేపీ కార్యకర్త, నేతలు పాల్గొనాలని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ నాంపల్లి స్టేట్ ఆఫీస్లో బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని వారు తెలిపారు.
ముఖ్య అతిధిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నరని కార్యకర్తలకు కిషన్రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలపై నేతలతో చర్చించారు. అలాగే.. హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో వర్ష ప్రభావిత పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం వరద సహాయక చర్యల్లో ప్రతి ఒక్కరు పాల్గోనలని కోరారు.