కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా : పుట్టా మధు

ఐటీ మంత్రి శ్రీధర్ బాబుపై మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పుట్టా మధు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటుకు రూ.2 వేలు ఇచ్చి శ్రీధర్ బాబు గెలిచారన్నారు

By :  Vamshi
Update: 2024-06-24 10:12 GMT

హస్తం పార్టీపై బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే మోసం,దగా అని ఆరునెలల పాలనలో మరోసారి రుజువు చేసిందని అన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి శ్రీధర్ బాబుపై మధు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటుకు రూ.2 వేలు ఇచ్చి శ్రీధర్ బాబు గెలిచారని ఆరోపించారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇసుక మాఫియా గురించి ఎన్నో నీతులు చెప్పి... ఇప్పుడు ఆయనే దందాకు తెరలేపారన్నారు. మంథని అభివృద్ధిని పక్కన పెట్టి సంపాదనపై పడ్డారని విమర్శించారు. ఇసుక తరలింపుపై గ్రీన్ ట్రైబ్యునల్ ఆంక్షలు పెట్టినప్పటికీ మంథనిలో మాత్రం అమలు కావడం లేదన్నారు.

మంథనిలో సహజవనరుల ధ్వంసాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. శ్రీధర్ బాబు అండతో మంథనిలో ఇసుక, మట్టి మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. యథేచ్ఛగా ఇసుక తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మైనింగ్ ప్రమాణాలు పాటించకుండా ఒక లారీకి అనుమతి ఉంటే వంద లారీల్లో మట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు శ్రీధర్ బాబు కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళ్తోందని ఆరోపించారు. మైనింగ్ ప్రమాణాలు పాటించకుండా ఒక లారీకి అనుమతి ఉంటే వంద లారీల్లో మట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని అన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పై కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ద లేదాన్నారు. నియోజక వర్గ అభివృద్ధి గురించి శ్రీధర్ బాబు పట్టించుకోవడం లేదని కేవలం తన సంపాదన పైనే మంత్రి ద్రుష్టి సారించారని అన్నారు.

Tags:    

Similar News