ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

హైకమాండ్ పిలుపుమేరకు బయల్దేరిన తెలంగాణ సీఎం.. నేడు ఉదయం డిప్యూటీ సీఎం భట్టి కూడా

Update: 2024-08-22 17:49 GMT

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి పలువురు నాయకులతో కలిసి గురువారం రాత్రి ఢిల్లీకి బయల్దేరారు. ఆయనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ, ఎంపీ రఘువీర్ రెడ్డి, ప్రొటోకాల్ అడ్వైజర్ హర్కర వేణుగోపాల్ ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి బయల్దేరనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు మేరకు సీఎం ఢిల్లీకి బయల్దేరగా, డిప్యూటీ సీఎం నేడు ఉదయం బయలు దేరనున్నారు. ఈ పర్యటనలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకంతో పాటు కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఆరు బెర్త్ లకు గాను నాలుగు మంత్రి పదవుల భర్తీపై హైకమాండ్ తో చర్చించే అవకాశముందని తెలిసింది.

Tags:    

Similar News