బండి సంజయ్‌ను ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి : రావుల శ్రీధర్ రెడ్డి

బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండి కూడా అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు

By :  Vamshi
Update: 2024-08-11 08:59 GMT

కేంద్రమంత్రి బండి సంజయ్ మినిస్టర్ అయి ఉండి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియ సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను జైల్లో వేయాలని రేవంత్ రెడ్డికి చెప్పడం ఏంటి బండి సంజయ్‌ని ప్రశ్నించారు. కేటీఆర్ ఏం తప్పు చేశారని జైల్లో పెడతారని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు.

కేటీఆర్ ఏం తప్పు చేశారని జైల్లో పెడతారని అన్నారు. కేటీఆర్‌ను జైల్లో వేయకపోతే యుద్ధం చేస్తానని బండి సంజయ్ అంటున్నారు. జైల్లో వేసే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకుంటారా అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఎంపీగా ఉండి మసీదులు తవ్వుతానని అన్నారు. ఇప్పుడు జైశ్రీరామ్ పేరుతో కేంద్ర మంత్రి అయ్యారు శ్రీధర్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి తీసుకుని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి తీసుకురాలేదన్నారు. బండి సంజయ్ ను ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలని అన్నారు.

Tags:    

Similar News