వైఎస్సార్ విగ్రహాల దాడులుపై షర్మిల ఆగ్రహం

ఈ తరహా దాడులు పిరికిపందల చర్య: షర్మిల

Byline :  Vamshi
Update: 2024-06-09 07:23 GMT

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచాకాలు అత్యంత దారుణమని ఇది పిరికిపందల చర్యగా వర్ణించింది. తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ పేరు చెరపలేరని అలాంటి నేతకు నీచ రాజకీయలు, గెలుపు ఓటములు ఆపాదించడం తగదన్నారు. వైఎస్ఆర్‌ను అవమానించే చర్యలకు పాల్పడేవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. ఎక్స్‌ వేదికగా ఆమె ఈ దాడుల్ని ఖండిస్తూ ఓ పోస్ట్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.

ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం. రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదు, గెలుపు ఓటములు ఆపాదించడం తగదు. వైఎస్సార్‌ను అవమానించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు.. బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది’’ అని సందేశం ఉంచారామె. మరోవైపు.. ఏపీలో టీడీపీ శ్రేణుల దాడుల్ని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు పల్లంరాజు ఖండించారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారారయన.

Tags:    

Similar News