పార్లమెంట్లో ఆసక్తికర సన్నివేశం..మోదీ, రాహుల్ ఆత్మీయ పలకరింపు
పార్లమెంట్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు అధికార, విపక్ష నేతలు తేనీటి విందులో పాల్గొన్నారు.
పార్లమెంట్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నవ్వుతూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడటంతో లోక్ సభ ఆవరణలో తేనీటి విందు జరిగింది. సభలో ఉప్పూ నిప్పూగా ఉండే అగ్రనేతలిద్దరు సరదాగా ఉన్న ఇలా ఒకేచోట కూర్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సోఫాలో కూర్చోగా.. పక్కనే కుర్చీలో రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రామ్మోహన్ నాయుడు, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు వరుసగా కూర్చున్నారు. ఎదురుగా మరో సీట్లో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా ఉన్నారు. ఈ భేటీకి సంబంధించి ఇతర వివరాలేవీ బయటకు రాలేదు. ఇటీవల బంగ్లాదేశ్లో అలకల్లోల పరిస్థితులపై అఖిలపక్ష సమావేశంలో సేమ్ సీన్ రిపీట్ అయింది.