ఈ నెల 17న హైదరాబాద్ విమోచన వేడుకలకు అమిత్షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 17న హైదరాబాద్కు రానున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 17న హైదరాబాద్కు రానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దినోత్సవం సందర్భంగా అమిత్షా ముఖ్య అతిధిగా పాల్గోన్నారు.
ఈ కార్యక్రమంలో, అమితీతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. గతేడాది కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో గోల్కొండ ఖిల్లాలో హైదరాబాద్ విమోచన వేడుకలను నిర్వహించారు. ఈ ఏడాది మళ్లీ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే కార్య క్రమానికి అమిత్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, జనసమీకరణపై చర్చించేందుకు పార్టీ నేతలతో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు.